ఇబ్రహీంపట్నం పిబ్రవరి తేదీ 6 ప్రజాపాలన ప్రతినిధి * కలెక్టర్ కార్యాలయంలో ప్రతి సోమవారం రోజున

Published: Tuesday February 07, 2023

ప్రజావాణి కార్యక్రమం ద్వారా స్వీకరించిన ఫిర్యాదులను పెండింగ్ లేకుండా పరిష్కరించాలని జిల్లా అదనపు కలెక్టర్ తిరుపతి రావు అధికారులకు సూచించారు.సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణిలో భాగంగా వివిధ మండలాల నుండి తమ సమస్యలు తెలపడానికి వచ్చిన వారి దగ్గర నుంచి జిల్లా అదనపు కలెక్టర్ తిరుపతి రావు జిల్లా రెవెన్యూ అధికారి హరిప్రియతో కలిసి దరఖాస్తులను స్వీకరించారు. ప్రజావాణిలో వచ్చే ఫిర్యదులను పెండింగ్ లేకుండా సత్వరమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ప్రజావాణిలో వివిధ అంశాలపై 35 దరఖాస్తులు వచ్చాయని తెలిపారు.
ఈ సమావేశంలో జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు-