పల్లె ప్రగతి కార్యక్రమాన్ని బహిష్కరించిన సైదల్లిపురం సర్పంచ్
Published: Saturday June 04, 2022
పల్లె ప్రగతి కార్యక్రమాన్ని బహిష్కరించిన సైదల్లిపురం సర్పంచ్ చిట్టి బాబు మధిర రూరల్ జూన్ 3 ప్రజా పాలన ప్రతినిధి మండలం పరిధిలో శుక్రవారం నాడుసైదల్లిపురం గ్రామ పరిధిలో ఈరోజు ఐదో విడత పల్లె ప్రగతి కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ బహిష్కరించడం జరిగింది. గత రెండు సంవత్సరాలుగా పల్లె ప్రగతి కార్యక్రమానికి నిధులు ఇవ్వకుండా ఇప్పుడు మళ్లీ పల్లె ప్రగతి కార్యక్రమం చేయమనడం విడ్డూరంగా ఉందని సైదల్లిపురం సర్పంచ్ *పులి బండ్ల చిట్టిబాబు* అన్నారు పల్లె ప్రగతి కి ప్రత్యేక నిధులు ఇవ్వకుండా, పాత బిల్లు ఇవ్వకుండా, మళ్ళీ పనులు చేయటం సాధ్యపడదు అని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొనటానికి ఎం.పి.డి.ఓ సి.పి.ఓ వచ్చారు.
Share this on your social network: