విద్యతోనే అభివృద్ధి : ఎఈఓ మను కుమార్

Published: Thursday November 11, 2021
ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి నవంబర్ 12 ప్రజాపాలన : సమాజంలో విద్యతోనే అభివృద్ధి చెందవచ్చని ఆసిఫాబాద్ ఎంఈఓ మను కుమార్ అన్నారు. బుధవారం ఎంపీపీఎస్ ఉర్దూ మీడియం పాఠశాలలో ఆల్ ఇండియా ఐడియల్ టీచర్స్ అసోసియేషన్ ఐతా ఆధ్వర్యంలో విద్యార్థులకు బ్యాగ్స్ నోట్ బుక్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కష్టపడి చదివి ఉన్నత విద్యలో రాణించి తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలన్నారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయడం చాలా గొప్ప విషయం అని ఐటా సభ్యులను అభినందించారు. ఈ కార్యక్రమంలో లైన్స్ క్లబ్ అధ్యక్షుడు శంకర్, స్కూల్ ప్రధానోపాధ్యాయులు నిజాముద్దీన్, ఎంఐఎం అధ్యక్షులు అబ్దుల్ హన్నాన్, జర్నలిస్ట్ యూనియన్ టియూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ రెహమాన్, పాఠశాల హెచ్ ఎం రియాజ్ అహ్మద్, ఎల్ శంకర్, తదితరులు పాల్గొన్నారు.