క్లబ్ నూతన కార్యదర్శిగా ఆర్.నర్సిములు

Published: Monday May 03, 2021
వికారాబాద్, మే 02, ప్రజాపాలన బ్యూరో : వికారాబాద్ క్లబ్ అభివృద్ధికి నా వంతు కృషి చేస్తానని మున్సిపల్ 19వ వార్డు కౌన్సిలర్ రాయికల్ నర్సిములు అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని క్లబ్ ఎన్నికలు జరుగగా క్లబ్ సభ్యులు కార్యదర్శిగా రాయికల్ నర్సిములును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్లబ్ సభ్యుల అభ్యున్నతికి, క్లబ్ పురోగతికి అహర్నిశలు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ రోజు (ఆదివారం) సాయంత్రం జరిగే ప్రమాణ స్వీకారానికి వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ ను సాదరంగా ఆహ్వానించారు. అంతకు ముందు ఎమ్మెల్యేను కలిసి తాను క్లబ్ కార్యదర్శిగా ఎన్నికైన విషయాన్ని తెలిపి మిఠాయిలు ఒకరికొకరు తినిపించుకున్నారు. ఈ కార్యక్రమంలో క్లబ్ మాజీ కార్యదర్శి టిఆర్ఎస్ పార్టీ నాయకులు లక్ష్మీకాంత్ రెడ్డి పాల్గొన్నారు.