రూ 7 లక్షలతో సీసీ రోడ్డు పనులను ప్రారంభించిన కార్పొరేటర్ బండారు

Published: Wednesday January 11, 2023
మేడిపల్లి, జనవరి 10 (ప్రజాపాలన ప్రతినిధి)
రామంతాపూర్ డివిజన్ అభివృద్ధిలో భాగంగా పాతరామంతాపూర్ బొడ్రాయి దగ్గర స్థానిక కార్పొరేటర్ బండారు శ్రీవాణి వెంకటరావు రూ 7 లక్షల వ్యయంతో సీసీ రోడ్డు పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ డివిజన్లోని సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తామని తెలిపారు. 
కార్యక్రమంలో రామంతాపూర్ డివిజన్ బిజెపి అధ్యక్షులు బండారు వెంకట్రావు, బుర్ర రాజేశ్వర్, మామిండ్ల సుధాకర్ యాదవ్, పడిగం నగేష్, ముస్తాక్, కపిల్ గౌడ్, వేముల తిరుపతయ్య, మరియు స్థానికులు పాల్గొన్నారు.