రూ 7 లక్షలతో సీసీ రోడ్డు పనులను ప్రారంభించిన కార్పొరేటర్ బండారు
Published: Wednesday January 11, 2023
మేడిపల్లి, జనవరి 10 (ప్రజాపాలన ప్రతినిధి)
రామంతాపూర్ డివిజన్ అభివృద్ధిలో భాగంగా పాతరామంతాపూర్ బొడ్రాయి దగ్గర స్థానిక కార్పొరేటర్ బండారు శ్రీవాణి వెంకటరావు రూ 7 లక్షల వ్యయంతో సీసీ రోడ్డు పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ డివిజన్లోని సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తామని తెలిపారు.
కార్యక్రమంలో రామంతాపూర్ డివిజన్ బిజెపి అధ్యక్షులు బండారు వెంకట్రావు, బుర్ర రాజేశ్వర్, మామిండ్ల సుధాకర్ యాదవ్, పడిగం నగేష్, ముస్తాక్, కపిల్ గౌడ్, వేముల తిరుపతయ్య, మరియు స్థానికులు పాల్గొన్నారు.
Share this on your social network: