జిల్లా కేంద్రంలో భారీ బహిరంగసభ ..మాజీ ఎమ్మెల్సీ కోక్కిరాల ప్రేమ్ సాగర్ రావు. మంచిర్యాల బ్యూర

Published: Tuesday March 28, 2023
సీఎల్పీ నాయకుడు భట్టి విక్రమార్క చేపట్టిన పాదయాత్రలో భాగంగా మంచిర్యాల నియోజకవర్గంలో భారీ బహిరంగ సభ ఉంటుందని మాజీ ఎమ్మెల్సీ కోక్కిరాల ప్రేమ్ సాగర్ రావు అన్నారు. సోమవారం ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. భట్టి విక్రమార్క చేపట్టిన పాదయాత్ర మంచిర్యాల చేరుకోగానే మంచిర్యాల లేదా సిసిసిలో బహిరంగ సభ ఉంటుందని ఆయన చెప్పారు. రెండవ తేదీన సభ నిర్వహించాలని తొలుత భావించినప్పటికీ కొన్ని కారణాల వల్ల వాయిదా పడిందని ఆయన తెలిపారు. రెండు మూడు రోజుల్లో తేదీని ఖరారు చేస్తామని ఆయన చెప్పారు.  మంచిర్యాల బహిరంగ సభ రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకునేలా ఉంటుందని ఆయన తెలిపారు. రాష్ట్ర జాతీయ నాయకులు సభకు హాజరవుతారని ఆయన వివరించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి విముక్తి జరిగి, కాంగ్రెస్ అధికారంలోకి రావాలంటే కార్యకర్తలు సమిష్టి కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. కాంగ్రెస్ హయాంలో జరిగిన అభివృద్ధి ఎంతో ఉందని ఆయన అన్నారు. భట్టి విక్రమార్క చేపట్టిన జోడో యాత్ర రేవంత్ రెడ్డికి పోటీ కాదని ఆయన తెలిపారు. రాహుల్ గాంధీ అన్ని ప్రాంతాల్లో పాదయాత్ర చేయలేని కారణంగా రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క అన్ని ప్రాంతాలను చుట్టుముట్టేలా కార్యక్రమానికి చేపట్టారని ఆయన వివరించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ వడగండ్ల వాన వల్ల నష్టపోయిన రైతులకు పరిహారం ఇస్తామని చెప్పడాన్ని స్వాగతిస్తున్నామని అయితే కాలేశ్వరం ముంపు వల్ల నష్టపోయిన మంచిర్యాల నియోజకవర్గం లోని రైతులకు ఇతరులకు పరిహారం చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో డిసిసి అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు.