అమరవీరుడు జర్నలిస్ట్ షోయబుల్లాఖాన్" స్పూర్తితో ఉద్యమించాలి ** ఘనంగా షోయబుల్లాఖాన్ 74 వ వర్ధంత

Published: Tuesday August 23, 2022
ఆసిఫాబాద్ జిల్లా ఆగస్టు22 (ప్రజాపాలన, ప్రతినిధి) : తెలంగాణ సాయుధ పోరాట యోధుడు అమరవీరుడు జర్నలిస్ట్ షోయబుల్లాఖాన్ స్ఫూర్తితో హక్కుల సాధనకై ఉద్యమించాలని టీయూడబ్ల్యూజే(ఐజేయు) జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ రహమాన్ పిలుపునిచ్చారు.  సోమవారం జిల్లా కేంద్రంలో టీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో షోయబుల్లాఖాన్ వర్ధంతి కార్యక్రమం ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం జిల్లా అధ్యక్షుడు రహమాన్ మాట్లాడుతూ పెత్తనానికి వ్యతిరేకంగా నైజాం రజాకార్ల భూస్వాములకు వ్యతిరేకంగా జర్నలిస్ట్ షోయబ్ అక్షరమే ఆయుధంగా ప్రజలను చైతన్యం వేశారన్నారు. ఎన్నో బెదిరింపులు వచ్చినప్పటికీ భయపడకుండా ప్రజా  చైతన్యం కోసం, హైదరాబాద్ విముక్తి కోసం అలుపెరుగని పోరు కొనసాగించారు. ప్రజాస్వామ్య కాంక్షతో పెత్తందారుల వ్యవస్థకు వ్యతిరేకంగా ప్రజల కోసం జర్నలిజం లోకి వచ్చి కలంతో అప్పటి పాలకులను ఉక్కిరిబిక్కిరి చేశారని గుర్తు చేశారు. తెలంగాణ ముద్దుబిడ్డ షోయబుల్లాఖాన్ నేటి తరాలకు తెలియజేసే విధంగా పాఠ్యపుస్తకాల్లో చేర్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు ప్రకాష్ గౌడ్, అబ్దుల్ హన్నన్, దేవునూర్ రమేష్, సురేష్ చారి, వారణాసి శ్రీనివాస్, చీల నితీష్, జానకిరామ్,వడ్లూరి సురేష్, సోల్జర్ తదితరులు పాల్గొన్నారు.