ఆసరా పెన్షన్ కార్డుల పంపిణీ

Published: Saturday September 03, 2022
జగిత్యాల, సెప్టెంబర్ 02 (ప్రజాపాలన ప్రతినిధి): జగిత్యాల రూరల్ మండలం పొలాస గ్రామంలో 180 మందికి నూతనంగా మంజూరైన పెన్షన్  కార్డులను లబ్ధిదారులకు ఎమ్మేల్యే డా.సంజయ్ కుమార్, జెడ్పీ చైర్ పర్సన్ దావ వసంతసురేష్ లతో కలిసి అందజేశారు. అనంతరం 5 గురికి సిఎం సహాయ నిధి ద్వారా మంజూరైన 1 లక్ష 20 వేల రూపాయలు, 11 మందికి కళ్యాణ లక్ష్మి పథకం ద్వారా మంజూరైన చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రాజేంద్రప్రసాద్, ఏఎంసి చైర్మన్ నక్కల రాధ, పాక్స్ చైర్మన్ మహిపాల్ రెడ్డి, సర్పంచ్ భారతి నందయ్య, మాజీ సర్పంచ్ నరేష్, రైతు బంధు సమితి మండల కన్వీనర్ రవీందర్ రెడ్డి, గ్రామ శాఖ అధ్యక్షులు రామ్ శంకర్, కో ఆప్షన్ జావిద్, పాక్స్ డైరెక్టర్ పోచయ్య, నాయకులు సురేష్, రెంటల సత్యనారాయణ, కె.రాజు, ఆరే తిరుపతి, మెళ్ళ శంకర్, లక్ష్మి, నర్సయ్య, సర్పంచుల ఫోరమ్ అధ్యక్షులు జాను, ఎంపిడిఓ రాజేశ్వరి, ఎంపిఓ రవి బాబు, వివిధ కుల సంఘాల నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
 
 
 
Attachments area