ఎస్సి కార్పొరేషన్ లోన్ పత్రాలను అందజేసిన ఎంపీపీ...

Published: Thursday June 17, 2021
సారంగాపూర్, జూన్ 16 (ప్రజాపాలన ప్రతినిధి) : సారంగాపూర్ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో 2018 -19 ఆర్ధిక సంవత్సరంనకు సంబంధించిన ఎస్సి కార్పొరేషన్ నుండి వివిధ పథకాలపై 11 మందికి 50 వేల చొప్పున మంజూర్ కాబడిన ఉత్తర్వులను మండల పరిషత్తు అధ్యక్షురాలు కోల జమునశ్రీనివాస్ జడ్పీటీసీ యం.మనోహర్ రెడ్డి వైస్ ఎంపీపీ సోల్లు సురేందర్ రేచపల్లి ఎంపీటీసీ భూక్యా లావణ్యరాథోడ్ సర్పంచ్ ఎడ్మల జయ తదితరులు అందజేశారు. ఈ కార్యక్రమములో ఎంపీడీఓ జే.పుల్లయ్య ఎంపీవో పి.శశికుమార్ రెడ్డి కార్యాలయ సిబ్బంది కిషోర్ కార్తీక్ పాల్గొన్నారు.