ఘనంగా కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు
Published: Wednesday September 28, 2022
జగిత్యాల, సెప్టెంబర్ 27 (ప్రజాపాలన ప్రతినిధి): జగిత్యాల జిల్లా పరిషత్ కార్యాలయంలో జెడ్పీ చైర్ పర్సన్ దావ వసంత సురేష్ ఆధ్వర్యంలో ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ 107 వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. లక్ష్మణ్ బాపూజీ చిత్ర పటానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు. తెలంగాణ ఉద్యమంలో లక్ష్మణ్ బాపూజీ సేవలను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ దేశం, తెలంగాణ రాష్ట్రం గర్వించదగ్గ గొప్ప పోరాట యోధుడన్నారు. బడుగు బలహీన వర్గాల కోసం, తెలంగాణ సాధన కోసం జీవితాంతం పోరాడిన మహానీయిలన్నారు. లక్ష్మణ్ బాపూజీ స్పూర్తీ మలి దశ తెలంగాణ సాధన పోరాటం లో ఇమిడి ఉందన్నారు. ఈ కార్యక్రమంలో సీఈఓ రామానుజన్ చార్యులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: