తెలంగాణలో బీజేపీదే అధికారం..
Published: Wednesday March 30, 2022
మండల అధ్యక్షులు ఆపతి రామారావు..
తల్లాడ, మార్చి 29 (ప్రజాపాలన న్యూస్): రానున్న సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో కూడా కాషాయ జెండా రెపరెపలాడుతుందని, బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని ఆ పార్టీ తల్లాడ మండల అధ్యక్షులు అపతి వెంకటరామారావు జోస్యం చెప్పారు. మంగళవారం అంజనాపురంలో జరిగిన పార్టీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉండి అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిందని దుయ్యబట్టారు. ప్రభుత్వ పథకాలను టిఆర్ఎస్ కార్యకర్తలకే కేటాయిస్తున్నారని, అర్హులైన లబ్ధిదారులకు మోండిచేయి చూపిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నంబూరు రామలింగేశ్వరరావు, వీరంరాజు, బాలాజీ నాయక్, కరుణాకర్, పాల్గొన్నారు.
Share this on your social network: