మాజీ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి చిత్రానికి పాలాభిషేకం

Published: Monday April 26, 2021
పరిగి, ఏప్రిల్ 25, ప్రజాపాలన ప్రతినిధి : వికారాబాద్ జిల్లా పరిగి మండల పరిధిలోని రాపోల్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పరిగి మాజీ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి చిత్రానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ  వికారాబాద్ జిల్లాను జోగులాంబలో కలిపిన టిఆర్ఎస్ ప్రభుత్వంపై ఎన్నో అలుపెరుగని పోరాటాలు, ఉద్యమాలు చేసి వికారాబాద్ జిల్లా అంటే రాష్ట్ర ప్రభుత్వానికి చెమటలు పట్టేలా జిల్లా నాయకులు అందర్నీ చైతన్యవంతం చేసి కలిసికట్టుగా పోరాటం చేసి వికారాబాద్ జిల్లాను చార్మినార్ జోన్లో కలిపినందుకు కృషి చేసిన రామ్మోహన్ రెడ్డికి వికారాబాద్ జిల్లా ప్రజలు యువకులు ఉద్యోగులు ప్రతి ఒక్కరు కూడా రుణపడి ఉంటారు అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ అధ్యక్షుడు వెంకటేష్ పరిగి మండల కోశాధికారి ఈశ్వర్ ఆచారి, యువజన కాంగ్రెస్ పరిగి మండల అధ్యక్షుడు పి నాగవర్ధన్, గ్రామ వార్డు మెంబర్ రవీందర్ రెడ్డ్డి, బూత్ కమిటీ సభ్యులు శేఖర్, బుగ్గ రాములు, రాకేష్, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.