ఘనంగా రాజీవ్ గాంధీ 30వ వర్ధంతి నిర్వహించి యూత్ కాంగ్రెస్

Published: Saturday May 22, 2021
పాలేరు, మే 21, (ప్రజాపాలన ప్రతినిధి) : ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలోని నేలకొండపల్లి పట్టణంలో తెలంగాణ సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ఆదేశాల మేరకు యువజన కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి జెర్రిపోతుల అంజనీ మరియు రాహుల్ గాంధీ కేర్ ఆధ్వర్యంలో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 30వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నేలకొండపల్లి గ్రామపంచాయతీ కార్మికులకు విధులు నిర్వహిస్తున్న పోలీస్ శాఖ, నేలకొండపల్లి వ్యవసాయ మార్కెట్ హమాలీలకు మాస్కులు పంపిణీ నిర్వహించారు. ఈ సందర్భంగా అంజని మాట్లాడుతూ..రాజీవ్ గాంధీ ఆశయాలకోసం, పార్టీ అభివృద్ధి కోసం పాటుపడాలన్నారు. ఈ కార్యక్రమంలో నేలకొండపల్లి మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ రాయపూడి నవీన్,  నేలకొండపల్లి మాజీ సర్పంచి మామిడి వెంకన్న, ఖమ్మం జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు  బొడ్డు బొందయ్య పాలేరు నియోజకవర్గ సేవాదళ్ అధ్యక్షుడు బచ్చలకూరి నాగరాజు, గుడిబోయిన వెంకటేశ్వర్లు, రెడ్డిమల్ల బాబు రెడ్డి, బోయిన వేణు, బాబీ, తదితరులు పాల్గొన్నారు