*పోలీస్ నియమకాలలో జరిగిన అవకతవల వెంటనే పరిష్కరించాలి* - తిరుమల్ రావు అరిగెల డిమాండ్
Published: Wednesday January 25, 2023
మంచిర్యాల టౌన్, జనవరి 24, ప్రజాపాలన : పోలీస్ నియమకాలలో జరిగిన అవకతవల వెంటనే పరిష్కరించాలని యువజన కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు తిరుమల్ రావు అన్నారు. యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు శివ సేన రెడ్డి ఆదేశాల మేరకు మంచిర్యాల జిల్లా యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో మంగళవారం ఐ బి చౌరస్తాలో సంతకాల సేకరణ చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పోలీస్ నియామకాలలో భాగంగా అభ్యర్థులకు ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనలు ఇబ్బంది కరంగా ఉండడం మూలంగా అట్టి నిబంధనలను తొలగించి, పాత పద్ధతిలో ఎంపిక చేయాలని అన్నారు.దీనిపై హైకోర్టు కూడా అభ్యర్థుల తగు న్యాయం చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఉత్తర్వులు జారీ చేసిన ఏ మాత్రం పట్టించుకోకుండా కోర్టు ఉత్తర్వులనే ధిక్కరించి నియామకాలను చేపడుతుందని మండిపడ్డారు. రన్నింగ్ లో క్వాలిఫై అయిన వారందరిని మెయిన్స్ పరీక్ష కి అనుమతించాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో మంచిర్యాల నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి అజయ్ గౌడ్, యువజన కాంగ్రెస్ నాయకులు అడెపు రవి, రచ్చ నరేష్, వంశీ, రోహిత్, రాజు,శ్రీనివాస్, రాజేష్, గోపి,లోకేష్,సందీప్,ముకేష్ తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: