తహశీల్దార్ కు వినతి

Published: Thursday November 25, 2021
యాదాద్రి నవంబర్ 24 వలిగొండ ప్రజాపాలన ప్రతినిది రైతులు పండించిన వరి దాన్యం కొనుగోలు కేంద్రాలలో నిల్వచేసి 45 రోజులు గడుస్తున్నా ఇప్పటి వరకు కొనుగోళ్లు వేగంగా నిర్వహించడం లేదని ఏఐసీసీ,టిపిసిసి పిలుపు మేరకు డిసిసి అధ్యక్షులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో స్థానిక తహశీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి తహశీల్దార్ నాగలక్ద్మీ కి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు పాశం సత్తిరెడ్డి, కిసాన్ సెల్ మండల అధ్యక్షుడు బండారి నర్సింహారెడ్డి, పట్టణ అధ్యక్షుడు కంకల కిష్టయ్య, బిసి సెల్ మండల అధ్యక్షుడు బొల్ల శ్రీనివాస్ నాయకులు పల్లెర్ల రాజు, ఆవుల స్వామి, చెన్నయ్య, లింగారెడ్డి, కాసుల వెంకన్న, బర్మా జంగయ్య, కృష్ణ యాదవ్, ఎమ్మె మల్లేశం, జూకంటి నర్సింహా, రేపాక మలుగ రాములు, గుండాల సాయి తదితరులు పాల్గొన్నారు.