టీఆర్‌ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనం. శంకరపట్నం నవంబరు 28 ప్రజాపాలన రిపోర్టర్:

Published: Tuesday November 29, 2022

శంకరపట్నం మండల కేంద్రంలో సోమవారం జరిగిన సమావేశంలో టిఆర్ఎస్ టిఆర్ఎస్ మండల అధ్యక్షుడు గంట మైపాల్ మాట్లాడుతూ... డిసెంబర్ ఒకటో తేదీన మొలంగూర్ లోని వి.ఎస్.ఆర్ గార్డెన్లో మానకొండూరు  ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఆధ్వర్యంలో టిఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనానికి మంత్రి గంగుల కమలాకర్, ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్, జిల్లా అధ్యక్షులు జీవి రామకృష్ణారావు ముఖ్య అతిధులుగా పాల్గొననున్నారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమానికి శంకరపట్నం మండలంలోని అన్ని గ్రామాల నుంచి సర్పంచులు ఎంపీటీసీలు మార్కెట్ కమిటీ చైర్మన్ డైరెక్టర్లు రైతు సమన్వయకర్తలు కార్యకర్తలు అధిక సంఖ్యలో  హాజరుకావాలని ఆయన పిలుపునిచ్చారు