పలు కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్యే డా: సంజయ్ కుమార్

Published: Wednesday October 13, 2021
సారంగాపూర్, అక్టోబర్ 12 (ప్రజాపాలన ప్రతినిధి) : సారంగాపూర్ మండల్ రంగపేట గ్రామానికి చెందిన కట్ల గంగన్న గుండె పోటుతో మరణించగా బట్టు శేఖర్ అనారోగ్యంతో మరణించగా వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన అనంతరం రంగపెట్ వడ్డెర కాలనిలో బొదాసు హనుమంతు అనారోగ్యంతో భాదపడుతుండగా పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని ఎమ్మెల్యే అడిగి తెలుసుకున్నారు. ఎమ్మెల్యే వెంట సర్పంచులు బెక్కెం జమునశ్రీనివాస్ పల్లపు వెంకటేష్ మండల పార్టీ అధ్యక్షుడు రాజేందర్ రెడ్డి ప్యాక్స్ వైస్ చైర్మన్ బాపిరాజు గ్రామ శాఖ అధ్యక్షుడు తిరుపతి రమేశ్ వంశీ కిషన్ తదితరులు పాల్గొన్నారు.