ఆదివాసి విద్యార్థుల సంఘం మహాసభలను విజయవంతం చేయాలి

Published: Tuesday January 24, 2023

జన్నారం, జనవరి 22, ప్రజాపాలన: అదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో ఫిబ్రవరి 5న జరిగే ఆదివాసి విద్యార్థుల సంఘం రెండో మహాసభలను విజయవంతం చేయాలని సోమవారం తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భీంరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సభకు సంబంధించిన సన్నాహక సమావేశాన్ని జన్నారం మండల కేంద్రంలోని ఆదివాసి గిరిజన సంఘం కార్యాలయంలో కార్యక్రమాన్ని నిర్వహించారు. మండలంలోని గ్రామ గ్రామన ఉన్న గిరిజన సంఘాల సభ్యులు రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గిరిజన నాయకులు రవికుమార్, మండల గిరిజన నాయకులు, తదితరులు పాల్గొన్నారు.