డివిజన్లో మొక్కలు పంపిణీ చేసిన కార్పొరేటర్ అనంతరెడ్డి

Published: Tuesday July 13, 2021
మేడిపల్లి, జూలై 12 (ప్రజాపాలన ప్రతినిధి) : పట్టణ ప్రగతి, హరితహారం కార్యక్రమంలో భాగంగా పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 24వ డివిజన్ ప్రశాంత్ నగర్ కాలనీలో స్థానిక కార్పొరేటర్ ఎంపల్ల అనంత రెడ్డి ఆధ్వర్యంలో ప్రతి ఇంటికి 6 మొక్కలను పంపిణీ చేశారు. మొక్కల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మేయర్ జక్క వెంకట్ రెడ్డి, డిప్యూటీ మేయర్ కుర్ర శివ కుమార్ గౌడ్, కమిషనర్ శ్రీనివాస్ హాజరై కాలనీవాసులకు మొక్కలను పంపిణీ చేశారు. అనంతరం కార్పొరేటర్ అనంత రెడ్డితో కలిసి మేయర్, డిప్యూటీ మేయర్ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు తోడ్పడాలని సూచించారు.