తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు సహాయ ప్రభుత్వం, కెసిఆర్ ప్రతి తెలంగాణ రైతుకు బంధువు కోరుట్ల

Published: Friday November 18, 2022

కోరుట్ల, నవంబర్ 17 (ప్రజాపాలన ప్రతినిధి):
జగిత్యాల జిల్లా పోలాస వ్యవసాయ విశ్వవిద్యాలయంలో నిర్వహించిన కిసాన్ మేళా 2022 కార్యక్రమానికి జగిత్యాల శాసనసభ్యులు సంజయ్ మరియు జెడ్పి చైర్మన్ దావ వసంత తో కలిసి ముఖ్య అతిథిగా  కోరుట్ల శాసనసభ్యులు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు హాజరైనారు.
ఈ కార్యక్రమంలో కోరుట్ల శాసనసభ్యులు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు  మాట్లాడుతు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయాన రైతు అని, తెలంగాణ ప్రభుత్వం మన దేశంలోనే రైతుల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేసే ప్రభుత్వమని, తెలంగాణలో ప్రవేశపెట్టిన రైతు బంధు రైతు భీమ పథకాలు దేశానికే ఆదర్శని కొనియాడారు.దేశంలోని అన్ని రాష్ట్రాల రైతులు తెలంగాణ వైపు చూస్తున్నారని కేసిఆర్ రైతు పాలిట దేవుడని తెలిపారు.