ఘనంగా వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయ 22వ వార్షికోత్సవ వేడుకలు.

Published: Wednesday October 13, 2021

కోరుట్ల, అక్టోబర్ 12 (ప్రజాపాలన ప్రతినిధి) : కోరుట్ల పట్టణంలోనీ శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయ 22వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఉదయం స్థాపిత దేవతాపూజ, వాసవి హోమం పూర్ణాహుతి, హారతి, తీర్థ ప్రసాద వితరణ చేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు అల్లాడి ప్రవీణ్‌, కార్యదర్శి వినోద్‌, కోశాధికారి చంద్రపాల్‌, అల్లాడి మహేష్‌, మోటూరి ప్రవీణ్‌ కుమార్‌, మాజీ అధ్యక్షులు నీలి కాశీనాథ్‌, కోటగిరి ప్రసాద్‌, మంచాల జగన్‌, నీలి మధు, సంఘ నాయకులు కొత్త సుధీర్‌, నేతి శ్రీనివాస్‌, మోటూరి రమేష్‌, కూరగాయల శ్రీహరి, జలంధర్‌, మానుక శ్రీనివాస్‌, మహిళా సంఘం నాయకురాలు నీరజ, శైలజ, శోభ, జ్యోతి, తదితరులు పాల్గొన్నారు.