వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేసి మానవత్వం చాటుకున్న ఐ టి సి ఉద్యోగులు... బూర్గంపాడు(-ప్రజా పా

Published: Tuesday January 03, 2023
బూర్గంపాడు మండలం సారపాక-ఐటీసీ పీ ఎస్ పి డీ కర్మాగారంలో ఉద్యోగం చేస్తున్న  కార్మికులు అయినటువంటి కేసుపాక నరసింహారావు,కోమటిరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఇద్దరు మిత్రుల కలిసి సోమవారం పాత సారపాక ఎస్సీ కాలనీలో 50 మంది నిరుపేద వృద్ధులకు ఐటీసీ భద్రాచలం యూనిట్ అధికారి చెంగల రావు  చేతుల మీదుగా దుప్పట్లు పంపిణీ చేశారు..ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రస్తుతం చలి తీవ్రత ఎక్కువగా ఉండటం వల్ల  అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో వృద్ధులకు మానవతా దృక్పథంతో ముందుకొచ్చి దుప్పట్లు పంపిణీ చేయడం అభినందనీయం అన్నారు..ముందు ముందు ఇంకా మరెన్నో సహాయ సహకారాలు అందించాలని కోరారు.. ఈ కార్యక్రమంలో ఇస్రం శ్రీనివాస్,సామ సందీప్ రెడ్డి,ముత్యాలరావు,శ్రీనివాస్,కనకం వెంకటేశ్వర్లు,మధు,వీరయ్య తదితరులు పాల్గొన్నారు.