ప్రజావాణి ఫిర్యాదులను పరిష్కరించాలి

Published: Tuesday September 20, 2022
రెవెన్యూ డివిజనల్ అధికారి అశోక్ కుమార్
వికారాబాద్ బ్యూరో 19 సెప్టెంబర్ ప్రజా పాలన : ప్రజావాణి ఫిర్యాదుల పరిష్కారం పట్ల అధికారులు దృష్టి సారించాలని, రెవిన్యూ డివిజనల్ అధికారి అశోక్ కుమార్ అన్నారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశపు హాలులో సోమవారం ప్రజావాణిలో భాగంగా వివిధ సమస్యలపై ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజావాణిలో ఫిర్యాదులు రాకుండా చూడాలని ఇందుకోసం మండల స్థాయిలో తహసీల్దార్లు ఫిర్యాదుల పరిష్కారం పై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.  ప్రతి సోమవారం జిల్లాలోని అన్ని మండల కేంద్రాలలో తహసీల్దార్లు ప్రతి సోమవారం ప్రజావాణి నిర్వహించి ప్రజలకు ఇబ్బంది కలుగకుండా ఎక్కడి సమస్యలు అక్కడే పరిష్కరిస్తే జిల్లా వరకు ఫిర్యాదులు రావని ఆ దిశగా అధికారులు కృషి చేయాలన్నారు.
 సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుండి వివిధ సమస్యలపై 140 దరఖాస్తులు స్వీకరించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వికారాబాద్ ఆర్. డి. ఓ. విజయకుమారి, ఏ. ఓ. అమరేందర్, కలెక్టర్ కార్యాలయ తహసీల్దార్లు తదితరులు  పాల్గొన్నారు.