వృద్ధులకు దుప్పట్లు పంపిణీ

Published: Thursday August 26, 2021
బోనకల్లు, ఆగష్టు 25, ప్రజాపాలన ప్రతినిధి : బోనకల్ మండల కేంద్రంలోని దివ్య దాయ వృద్ధాశ్రమంలో సుడా డైరెక్టర్ దేవభక్తుని కిషోర్ బాబు కుమారుడు కాశ్యప్ జన్మదినం సందర్భంగా వృద్ధాశ్రమంలో వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేయడం జరిగింది. అనంతరం ఆశ్రమ నిర్వాహకులు ఇజ్రాయిల్ మాట్లాడుతూ జన్మదినం సందర్భంగా వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేయడం అభినందనీయమని అన్నారు. దుప్పట్లు పంపిణీ చేసిన కిషోర్ బాబుని వారి కుమారుడును వృద్ధులు వారు ఎన్నో ఉన్నతమైన స్థాయికి ఎదగాలని దీవించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆశ్రమ నిర్వాహకులు ఇజ్రాయిల్ మరియు తదితరులు పాల్గొన్నారు.