రాళ్ళగడ్డ తాండ అభివృద్ధే లక్ష్యం : సర్పంచ్ పట్లోళ్ళ శశిధర్ రెడ్డి

Published: Thursday January 20, 2022
వికారాబాద్ బ్యూరో 19 జనవరి ప్రజాపాలన : రాళ్ళగడ్డ తాండ అభివృద్ధికి చేపట్టాల్సిన సమస్యలను గుర్తించాలని మేకవనంపల్లి గ్రామ సర్పంచ్ పట్లోళ్ళ శశిధర్ రెడ్డి కార్యదర్శి శ్రావణికి సూచించారు. బుధవారం మోమిన్పేట్ మండల పరిధిలోని మేకవనంపల్లి అనుబంధ గ్రామం రాళ్ళగడ్డ తాండలో పరిష్కరించాల్సిన సమస్యలను పరిశీలించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ అనుబంధ గ్రామంలో అభివృద్ధి పనులు త్వరలో చేపడుతామని పేర్కొన్నారు. ముందుగా రాళ్ళగడ్డ (మేకవనంపల్లి తాండ) లో అత్యవసరంగా పరిష్కరించాల్సిన సమస్యలను గుర్తించి అభివృద్ధి పనులు చేపడుతామని స్పష్టం చేశారు. అనుబంధ గ్రామమైనా అభివృద్ధిలో నిర్లక్ష్యం చూపమని విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కారోబార్ కుమ్మరి శ్రీనివాస్, గ్రామ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.