ఇఫ్తార్ కార్యక్రమంలో పాల్గొన్న మల్లు నందిని విక్రమార్క

Published: Monday April 10, 2023
 మధిర, ఏప్రిల్ 9 ప్రజా పాలన ప్రతినిధి: మధిర పట్టణంలోని జామియా మసీదు వద్ద ఆదివారం ముస్లిం సోదరుల పవిత్ర మాసమైన రంజాన్ పండుగ ఉపవాస దీక్ష విరమణ ఇఫ్తార్ కార్యక్రమంలో మధిర నియోజకవర్గ శాసనసభ్యులు, శాసనసభాపక్ష నేత మల్లు భట్టి విక్రమార్క సతీమణి మల్లు నందిని విక్రమార్క పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ముస్లింల పవిత్రమైన పండుగ రంజాన్ పండుగని ఈ నెల మొత్తం కఠిన ఉపవాస దీక్ష చేసి ఆ అల్లాని వేడుకుంటారని అన్నారు.. ఇఫ్తార్ విందులో పాల్గొనడం అల్లా ప్రసాదించిన వరమని, ముస్లిం సోదరులందరూ రంజాన్ పండుగని ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని అందరికీ శుభాలు కలగాలని, ముస్లిం సోదరులకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు..
ఈ కార్యక్రమంలో మధిర మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సూరంశెట్టి కిషోర్ ,మున్సిపాలిటీ కౌన్సిలర్ కోన ధని కుమార్, పట్టణ మైనార్టీ సెల్ అధ్యక్షులు షేక్ జహంగీర్ ,మైనార్టీ నాయకులు సయ్యద్ రషీద్, నూర్ మహమ్మద్, బాజీ రబ్బాని, మహబూబ్, జమీల్ పాషా మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడు ధారా బాలరాజు కాంగ్రెస్ నాయకులు నిడమనూరు వంశీకృష్ణ బిట్రా ఉద్దండయ్య పులిబండ్ల చిట్టిబాబు ఆదిమాల శ్రీనివాసరావు ముస్లిం సోదరులు మొదలగు వారు పాల్గొన్నారు.