వ్యవసాయ మార్కెట్లో గల పెండింగ్ పనులను పూర్తిచేయాలి
Published: Monday December 06, 2021
వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్
వికారాబాద్ బ్యూరో 05 డిసెంబర్ ప్రజాపాలన : తెలంగాణ రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డిని హైదరాబాదులో గల మినిస్టర్స్ క్వార్టర్స్ లోని ఆయన నివాసంలో వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. అనంతరం వ్యవసాయ రంగం గురించి వికారాబాద్ నియోజకవర్గానికి సంబందించిన వివిధ అంశాలపై చర్చించడం జరిగింది. వికారాబాద్ నియోజక వర్గంలోని వివిధ వ్యవసాయ మార్కెట్లలో పెండింగ్ లో ఉన్న పనులను త్వరగా పూర్తిచేయాలని మంత్రిని కోరడం జరిగింది. అందుకు గాను మంత్రి సానుకూలంగా స్పందించారు.
Share this on your social network: