ముమ్మరంగా పట్టణ ప్రగతి, హరితహారం
Published: Thursday July 08, 2021
బాలాపూర్: (ప్రతినిధి) ప్రజాపాలన న్యూస్ : కాలనిలలో పలు సమస్యలు అడిగి తెలుసుకొని త్వరలో పరిష్కారం అవుతాయని కార్పొరేషన్ మేయర్ పేర్కొన్నారు. బడంగ్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 24వ డివిజన్ కార్పొరేటర్ ఏనుగు రామ్ రెడ్డి ఆధ్వర్యంలో పట్టణ ప్రగతి, హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమాన్నికి ముఖ్యఅతిథిగా కార్పొరేషన్ మేయర్ చిగురింత పారిజాత నర్సింహారెడ్డి పాల్గొని, స్థానిక కార్పొరేటర్ ఏనుగు రాంరెడ్డి తో కలిసి మొక్కలు నాటారు. అనంతరం పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా కాలనీల అధ్యక్షుల ద్వారా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆ సమస్యలకు అతి త్వరలో పరిష్కారం అవుతాయని హామీ ఇచ్చారు. మొక్కలు నాటి వాటిని సంరక్షించే బాధ్యత డివిజన్ కార్పొరేటర్ తో పాటు స్థానికులు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వివిధ కాలనీల అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులు, శానిటేషన్ సిబ్బంది, నగర దీపికలు, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: