నర్సి రెడ్డి పాదయాత్రకు సంఘీభావం తెలిపిన టీఎస్ యుటిఎఫ్ బోనకల్ మండల బృందం
Published: Friday July 16, 2021
బోనకల్లు, జూలై 15, ప్రజాపాలన ప్రతినిధి : ఉపాధ్యాయుల బదిలీలు పదోన్నతులు చేపట్టాలని కేజీబీవీ కాంట్రాక్ట్ ఉపాధ్యాయులకు పిఆర్సి వేతనాల ప్రకారం మినిమం బేసిక్స్ అమలు చేయాలని ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రైవేటీకరణ విధానాలను విడనాడాలని కోరుతూ నల్లగొండ నుండి ప్రగతి భవన్ వరకు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సి రెడ్డి చేపట్టిన పాదయాత్రకు నల్లగొండ జిల్లా చిట్యాల పట్టణంలో కలిసి టియస్ యుటియఫ్ బోనకల్ మండల బృందం సంఘీభావం తెలియజేసింది. ఈ సంధర్బంగా బోనకల్ మండల ప్రధాన కార్యదర్శి గుగులోతు రామకృష్ణ మాట్లాడుతూ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని నర్సి రెడ్డి పాదయాత్ర విజయవంతం కావాలని ఉద్యమ అభినందనలు తెలియ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో టీఎస్ యుటిఎఫ్ మండల అధ్యక్షులు కంభం రమేష్ మండల ప్రధాన కార్యదర్శి రామకృష్ణ కోశాధికారి ఆలస్యం. పుల్లారావు, మండల నాయకులు చిన్న రంగారావు, వీర బ్రహ్మ చారి తదితరులు పాల్గొన్నారు
Share this on your social network: