పెద్ద గోపతి నుండి మధిరకు విద్యుత్ సరఫరా చేసేందుకు చర్యలుమధిరకు తీరనున్న కరెంట్ కష్టాలువిద్

Published: Friday September 02, 2022

మధిర సెప్టెంబర్ 1 ప్రజాపాలన ప్రతినిధి  మధిర సబ్ డివిజన్ పరిధిలోని మండలాలకు త్వరలోనే పెద్దగోపతి 220 కెవి సబ్ స్టేషన్ నుండి మధిర 132 కెవి సబ్ స్టేషన్కు విద్యుత్ సరఫరా చేసేందుకు ముమ్మరంగా పనులు కొనసాగుతున్నాయని ఖమ్మం సర్కిల్ విద్యుత్ సూపరిండెంట్ సురేంద్ర పేర్కొన్నారు. ఇటీవల మధిర సబ్ డివిజన్లో విద్యుత్ సరఫరా జరుగుతున్న అవాంతరాలపై గురువారం మధిర డివిజన్ విద్యుత్ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ముందుగా మధిర సబ్ డివిజన్ విద్యుత్ శాఖ అధికారులు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిలకల్లు 220 కెవి సబ్ స్టేషన్ నుండి మధిర 132కెవి సబ్ స్టేషన్ కి సరఫరా అయ్యే విద్యుత్తులో తరచూ అంతరాయాలు ఏర్పడుతున్నాయని వారు తెలిపారు. వీటిని తొలగించడానికి  ఎక్కువ సమయభావం పడుతుందని వారు ఎస్ఈకి వివరించారు. అనంతరం ఎస్ఈ సురేంద్ర మాట్లాడుతూ తెలంగాణ ప్రాంతంలోని పెద్ద గోపతి 220 కెవి సబ్ స్టేషన్ నుండి మధిర 132 కెవి సబ్ స్టేషన్ కు విద్యుత్ సరఫరా చేసేందుకు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. దీనికి సంబంధించిన  టవర్ల ఏర్పాటు పనులు చివరి దశకు చేరుకున్నాయని ఆయన వెల్లడించారు. వీలైనంత త్వరలో మధిర 132 కెవి సబ్ స్టేషన్ కు ఆంధ్ర ప్రాంతంలోని చిల్లకల్లు నుండి కాకుండా పెద్దగోపతి నుండి పూర్తిస్థాయిలో విద్యుత్ సరఫరా అయ్యే విధంగా చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. మూడు నెలల కాల వ్యవధిలో పూర్తిస్థాయిలో మధిర, ఎర్రుపాలెం, బోనకల్ మండలాల విద్యుత్ వినియోగదారులు కోరుకుంటున్నట్లుగా పెద్దగోపతి నుండి మధిర 132 కె.వి సబ్ స్టేషన్ కు జరుగుతున్న విద్యుత్ టవర్ల పనులు పూర్తి చేసి విద్యుత్ సరఫరా సమస్యలను అధిగమించనున్నట్లు ఆయన తెలిపారు. దీంతో మధిర డివిజన్ ప్రజలకు చిలకల్లు విద్యుత్ చింతలు తీరని ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ఈ సమావేశంలో వైరా డివిజన్ డిఈ కృష్ణ  మధిర సబ్ డివిజన్ ఏడిఈ ఎం అనురాధ ఖమ్మం సర్కిల్ టెక్నికల్ ఏడిఈ సిహెచ్ సుధాకర్ రావు మధిర పట్టణ, మధిర రూరల్,  ఎరుపాలెం, మామునూరు ఏఈలు ఎస్ అనిల్ కుమార్, కే నాగేశ్వరరావు, వేణుగోపాల్, ఆర్ శ్రీనివాసరావు మరియు ట్రాన్స్ కో ఏఈ పాల్గొన్నారు.