ఇబ్రహీంపట్నం నవంబర్ తేదీ 14ప్రజాపాలన ప్రతినిధి *బాలల దినోత్సవం ఘనంగా జరిపారు*

Published: Tuesday November 15, 2022
ఇబ్రహీంపట్నం మండలం పరిధిలోని పోల్కంపల్లి     బాలల దినోత్సవం సందర్భంగా ప్రాథమిక పాఠశాల పోల్కంపల్లి లో చిల్డ్రన్స్ డే సెలబ్రేషన్స్ మరియు సెల్ఫ్ గవర్నమెంట్ డే జరుపుకోవడం జరిగింది. ఈ సందర్భంగా పోల్కంపల్లి గ్రామ వాస్తవ్యులు దొండ వినోద్ రెడ్డి పాఠశాల విద్యార్థులకు చక్కని విందు భోజనానికి ఏర్పాటు చేయడం జరిగింది. మరియు  గ్రామ ప్రముఖులు  డేరంగుల నరసింహ  సహకారంతో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతి ప్రధానం చేయడం జరిగింది. ఈ సందర్భంగా వినోద్ రెడ్డి స్వామికి శాలువా కప్పి సన్మానం చేయడం జరిగింది. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు నర్సింగరావు, కృష్ణ, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.