కంటి వెలుగు శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి జెడ్పిటిసి ఎర్రచంద్రశేఖర్

Published: Saturday February 04, 2023

జన్నారం ఫిబ్రవరి 03, ప్రజాపాలన: మంచిర్యాల జిల్లా జన్నారం మండలం మురిమడుగు గ్రామంలో శుక్రవారం కంటి వెలుగు శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని జెడ్పిటిసి ఎర్ర చంద్రశేఖర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వం ద్వారా ఉచితంగా నిర్వహిస్తున్న రెండో విడత కంటి వెలుగు కార్యక్రమం విజయవంతం చేయాలన్నారు. ప్రభుత్వం నుండి పేద ప్రజలకు సంబంధించిన అందత్వం నుండి నివారణకు కొరకు నిర్వహిస్తున్న కంటి వెలుగు కార్యక్రమం ప్రజల కోసం 23 రోజులు ప్రభుత్వం కొనసాగిస్తుందన్నారు. మురిమడుగు  గ్రామపంచాయతీ సర్పంచ్ భాగ్యలక్ష్మి ఆధ్వర్యంలో కంటి వెలుగు రెండో విడత నిర్వహిస్తుందన్నారు. ప్రభుత్వం నుండి కంటి వెలుగు కార్యక్రమంలో ఉచితంగా పరీక్షలు నిర్వహించి అవసరమైతే ఉచితంగా కళ్ళ అద్దాలు ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో కంటి వెలుగు మెడికల్ సిబ్బంది, గ్రామ అధికారులు సిబ్బంది, గ్రామస్తులు, ఆశా వర్కర్లు, తదితరులు పాల్గొన్నారు.