హోంమంత్రి పేరు చెప్పుకొని బెదిరింపులు

Published: Monday August 23, 2021
మేడిపల్లి, ఆగస్టు22 (ప్రజాపాలన ప్రతినిధి) : పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఎమ్మార్వో కార్యాలయం దగ్గర్లో ఉన్న లేక్ వ్యూ అపార్ట్మెంట్ వాసులను అదే అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్న మొహమ్మద్ షబ్బీర్ ఆలీ అనే వ్యక్తి  హోంమంత్రి పేరు చెప్పుకొని బెదిరింపులకు వేధింపులకు గురి చేస్తున్నారని లేక్ వ్యూ అపార్ట్మెంట్ వాసులు ఆవేదన వ్యక్తం చేశారు. లేక్ వ్యూ అపార్ట్మెంట్ వాసులు ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వారు మాట్లాడుతూ పీర్జాదిగూడలో లేక్ వ్యూ అపార్ట్మెంట్ లో ప్లాట్ కొనుగోలు చేసి గత8సంవత్సరాలుగా నివాసముంటున్న 16మంది ప్లాట్ ఓనర్ లలో ఒకరు జి -2లో నివాసం ఉండే మొహమ్మద్ షబ్బీర్ ఆలీ అనే వ్యక్తి అపార్మెంట్ వసతుల నిర్వహణలో తోటి ప్లాట్ ఓనర్స్ కు సహకరించకుండా హోంమంత్రి పేరు చెప్పుకొని బెదిరింపులకు పాల్పడుతూ వారిని వేధింపులకు గురిచేస్తున్నాడని మహమ్మద్ షబ్బీర్ అలీ పై 15 మంది ప్లాట్స్ ఓనర్స్ పోలీస్ స్టేషన్లో పిర్యాదుచేసిన అతనికి హోంమంత్రి అండదండలు ఉండడంతో ఎలాంటి చర్య తీసుకోలేదని అపార్ట్మెంట్ వాసులు పేర్కొన్నారు. అపార్మెంట్ ప్లాట్ లలో ఉండే మహిళల పట్ల అసభ్యంగా ప్రవసర్తించడం, ఇదేంటి అని ప్రశ్నిస్తే భౌతిక దాడులకు పాల్పడుతున్నట్లు వారి గోడు వినిపించారు. ఒక్కని వల్లప్లాట్స్ లో 15 కుటుంబాలకు జీవనమరణ సమస్యగా తయారయ్యిందని తెలిపారు. అతని ప్రవర్తనతో ఎప్పుడు ఏమిజరుగుతుందోనని షబ్బీర్ అలీ ఇంటిముందున్న ప్లాట్ ఓనర్ భయపడి తనఇంటిగుమ్మంలో సీసీ కెమెరాను అమర్చుకోగా తనను బెదిరిస్తున్నారని, తాను హోంమంత్రి మనిషినంటూ తనను ఎవరేమి చేయలేరాని బెదిరిస్తున్నాడని, అతనితో ప్రాణభయం ఉందని, దీనిపై ప్లాట్ లలోని 15కుటుంబాలకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. ఈ కార్యక్రమంలో హరిచరణ్, జహంగీర్, సురేందర్, రాంరెడ్డి, లక్ష్మణ్, సంతోష్, సుదీర్, నితీష్, రాధా, హారిక పార్వతీదేవి, 15ప్లాట్స్ కుటుంబాలు పాల్గొన్నారు.