ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెరాసదే విజయం

Published: Wednesday March 24, 2021

బాలాపూర్: (ప్రతినిధి) ప్రజాపాలన : హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ నియోజకవర్గంలోని ఎన్నికలలో తెరాస పార్టీ అభ్యర్థి మాజీ పి.వి నరసింహారావు గారి కూతురు వాణి దేవి గెలుపుకు ప్రధాన పాత్ర పోషించిన మన తెలంగాణ విద్యాశాఖ మంత్రి పి. సబితా ఇంద్రా రెడ్డి తమ నివాసంలో కలిసి పూల బుగ్గ తో శుభాకాంక్షలు తెలిపారు, నాదర్గుల్ ది భాగ్యనగర్ సహకార బ్యాంకు చైర్మన్ మర్రి నరసింహ రెడ్డి, సోషల్ మీడియా కన్వీనర్ కృష్ణారెడ్డి, తెరాస పార్టీ నాయకులు, టిఆర్ఎస్ కార్యకర్తలు, అభిమానులు యువకులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.