పట్టణ టిఆర్ఎస్ కమిటీ ఆధ్వర్యంలో డా.బిఆర్.అంబేద్కర్ 65 వర్ధంతి వేడుకలు

Published: Tuesday December 07, 2021
మధిర డిసెంబర్ 6 ప్రజాపాలన ప్రతినిధి మధిర టిఆర్ఎస్ కార్యాలయంలో భారతరత్న, రాజ్యాంగ నిర్మాత డా.బాబాసాహెబ్ అంబేద్కర్ 65 వర్ధంతి సందర్భంగా మధిర పట్టణంలోని TRS పార్టీ కార్యాలయంలో టౌన్ పార్టీ అధ్యక్షులు పల్లపోతు వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.. ఈ సందర్భంగా హాజరైన ప్రజా ప్రతినిధులు, నాయకులు అంబేద్కర్  చిత్ర పటానికి పూలు వేసి నివాళులర్పించి ఆయన చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ చిత్తారు నాగేశ్వరరావు, రైతు బంధు మండల కన్వీనర్ చావా వేణు, నాయకులు దేవిశెట్టి రంగారావు, టౌన్ కార్యదర్శి అరిగే శ్రీనివాసరావు, మండల కార్యదర్శి బొగ్గుల భాస్కర్ రెడ్డి, మహిళ విభాగం అధ్యక్షురాలు మల్లేశ్వరి, కార్యదర్శి పద్మావతి, సోషల్ మీడియా నియోజకవర్గ ఇంచార్జ్ తాళ్ళూరి హరీష్ బాబు, ఆళ్ల నాగబాబు, జెవి.రెడ్డి, యూత్ నాయకులు గద్దల రాజా, నాయకులు పల్లపోతుల ప్రసాద్, కపిలవాయి జగన్మోహన్ రావు, ఖాదర్, గుగులోతు కృష్ణ, ఆవుల రామకృష్ణ పబ్బతి రమేష్, చంటి తదితరులు పాల్గొన్నారు.