పశువులకు ప్రభుత్వం అందించే మందులనే వాడాలి. .. జిల్లా పశువైద్యదికారి రమేష్

Published: Tuesday February 28, 2023
లక్షటిపెట్, ఫిబ్రవరి 27, ప్రజాపాలన:
 
 పశుపోషకులు పశువులకు ప్రభుత్వం అందిస్తున్న ఉచిత నట్టాలనివారణ  మందును వినియోగించుకోవాలని జిల్లా పశువైద్యాధికారి రమేశ్ అన్నారు మండలంలోని వెంకట్రావు పెట్ లో సోమవారం నిర్వహించిన ఉచిత నట్టల నివారణ  కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. మేకలకు గొర్రెలకు వచ్చే వ్యాధుల గురించి వివరించారు.  పశువుల సంబంధించిన వ్యాధుల నివారణ, పెంపకంలో మెలకువలు గురించి తెలిపారు. మేకలకు నట్టల మందు వేశారు. అదేవిధంగా  ఎస్ ఎస్ జి రకం గడ్డి విత్తనాలు పశువైద్యశాలలో అందుబాటులో ఉన్నాయని, కావల్సిన రైతులు తీసుకోవచ్చు అని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో పశువైద్యాధికారిని శ్వేతా, వి ఏ లు కుష్ణపెళ్లి స్వామి, మచ్చ గంగమల్లు, రైతులు, తదితరులు పాల్గొన్నారు.