యోగా డే ని విజయవంతం చేయాలి

Published: Monday June 20, 2022
మంచిర్యాల టౌన్,జూన్ 19,ప్రజాపాలన :  యోగా డే ని విజయవంతం చేయాలని ఈనెల 21న నిర్వహించబోయే ఎనిమిదవ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని సోమవారం రోజు ఉదయం మంచిర్యాల బాయ్స్ మైదానం నుంచి బెల్లంపల్లి చౌరస్తా వరకు వాక్ ఫర్ యోగా  కార్యక్రమం నిర్వహించారు. ఇంటర్నేషనల్ యోగా డే ఆహ్వాన  కరపత్రాలు విడుదల చేశారు.ఈ కార్యక్రమంలో  ఓం అష్టోత్తర యోగా పీఠ్, స్వామి వివేకానంద యోగ ట్రస్ట్, భగవద్గీత ధ్యానమండలి, మైత్రి యోగా సెంటర్, గరిమిల్ల వాకర్స్ అండ్ వెల్ఫేర్ అసోసియేషన్,ఫిట్నెస్ సెంటర్,మంచిర్యాల వాకర్స్ క్లబ్ మొదలగు యోగా సంస్థలూ పాల్గొని ఇంటర్నేషనల్ యోగ డే అంతర్జాతీయ యోగ దినోత్సవం జూన్ 21 మంచిర్యాల బాయ్స్ మైదానంలో ఉదయం 6 నుంచి 7.30 వరకు జరిగే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరారు. తదనంతరం యోగా సభ్యులు బెల్లంపల్లి చౌరస్తా యందు వివిధ యోగాసనాలతో అలరించారు.ఈ కార్యక్రమంలో యోగా సభ్యులు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని, యోగా గొప్పతనాన్ని తెలియజేశారు.