నిదానపురం సర్పంచ్ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవం సందర్భంగా ఎంపీపీ కి ఘన సన్మానం

Published: Friday March 11, 2022
మధిర మార్చి 10 ప్రజాపాలన ప్రతినిధి మధిర మండలం నిధానపురం గ్రామపంచాయతీ నందు గురువారం నాడుమహిళ దినోత్సవం సందర్భంగా గ్రామ పంచాయతీ మహిళా వార్డు సభ్యులు, అంగన్వాడీ సిబ్బంది, హెల్త్ వర్కర్స్, ఐకేపీ సిబ్బంది ని వారి యొక్క విశిష్ట సేవలకు గాను శ్రీమతి మెండెం లలిత, ఎంపీపీ ఆధ్వర్యంలో శ్రీయుత ఎంపీడీఓ కుడుముల విజయభాస్కర్ రెడ్డి మరియు సర్పంచ్ బాదా కృష్ణారెడ్డి అధ్యక్షతన ఘనంగా సత్కరించుట జరిగినది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలో రాష్ట్రాల్లో. మహిళలు రాజకీయంగా వ్యాపారాలు పారిశ్రామికంగా మహిళలు చైతన్యవంతులై రాష్ట్రాల్లో గ్రామపంచాయతీలు మండల పరిషత్తులో మహిళలు కూడా రాజకీయంగా పెరుగుతూ ప్రజల్లో విశ్వాసంతో కూడిన మహిళలకు మహిళలు అంటే మహిళ దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలిపారుకార్యక్రమంలో టీఆరెస్ నాయకులు వెంకన్న, ఎంపీటీసీ సభ్యులు శ్రీమతి వెంపటి మరియమ్మ, ఉప సర్పంచ్ శ్రీ అమరవాది నర్సిరెడ్డి, గ్రామపంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు..