స్వామి వివేకానంద జయంతి ఘనంగా నిర్వహించారు

Published: Thursday January 13, 2022
ఇబ్రహీంపట్నం జనవరి 12 ప్రజాపాలన ప్రతినిధి : తుర్కయంజాల్ మున్సిపాలిటీ భారతీయ యువమోర్చా అధ్యక్షుడు ఎలిమినేటి నర్సింహారెడ్డి ఆధ్వర్యంలో స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకొని రాగన్న గూడ కూడలి లోని వివేకానంద చౌరస్తా లో ఆమహానీయుని చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యాతిధి గా విచ్చేసిన బిజెపి వనపర్తి ఇంచార్జి బోసుపల్లి ప్రతాప్ మాట్లాడుతూ భారతదేశ కీర్తికిరీటం స్వామి వివేకానంద ప్రపంచ మానవాళికి మార్గదర్శి స్వామి వివేకానంద  అతి చిన్న వయసులో ప్రపంచ దేశాలలో హిందూ మత ఖ్యాతి ని చాటి చెప్పిన గొప్ప ఆదర్శవాది, మానవతావాది స్వామి వివేకానంద  స్వామివారి జన్మదినాన్ని పురస్కరించుకొని జనవరి 12 ను జాతీయ యువజన దినోత్సవంగా మనం జరుపు కుంటున్నామని ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో బిజెపి కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యదర్శి శ్రీ నల్లవేల్లి నిరంజన్ రెడ్డి, జిల్లా కోశాధికారి కొత్త రాంరెడ్డి జిల్లా ఎస్సిమోర్చా అధ్యక్షుడు బచ్చిగళ్ల రమేష్, ఓబీసీ మోర్చా రాష్ట్ర నాయకుడు సానేం అర్జున్ గౌడ్, మున్సిపాలిటీ ప్రధానకార్యదర్శులు యంజాల శ్రీకాంత్ రెడ్డి మాధు శ్రీకాంత్ రెడ్డి, బిజెపి ఉపాధ్యక్షుడు మాడుగుల బాలకృష్ణ, యువమోర్చా నాయకులు కానపురం లక్ష్మణ్ మారగౌని విశాల్ గౌడ్, అర్జున్ ఎస్సిమోర్చా నాయకుడు ముదిగొండ నర్సింహ శ్రీకాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.