స్పందించిన విద్యుత్ అధికారులు

Published: Monday June 14, 2021
గుమ్మడిదల, జూన్ 13 (ప్రజాపాలన ప్రతినిధి) : దోమడుగు గ్రామ పరిధిలో గత వారం రోజుల్లో రెండు పశువులు విద్యుదాఘాతానికి బలైన నేపథ్యంలో విద్యుత్ అధికారులు స్పందించారు. పొలాల వద్ద కిందకు వేలాడుతూ ఉండే విద్యుత్ తీగలు మార్చారు. అదే విధంగా గ్రామంలో విద్యుత్ స్తంభాలు వంగిన విరిగిన వాటిని గుర్తించి కొత్త స్తంభాలు ఏర్పాటు చేయాలని సర్పంచ్ విద్యుత్ అధికారులను కోరారు. స్పందించిన విద్యుత్ డీఈ, ఏఈ, వీలైనంత త్వరలో కొత్త స్తంభాలు ఏర్పాటు చేసి ఇ విద్యుత్ తీగలు సవరిస్తారాని తెలిపారు. బాధిత రైతులకు నష్టపరిహారం అందించేలా చర్యలు తీసుకోవాలని సర్పంచ్ రాజశేఖర్ అధికారులను కోరగా ప్రభుత్వం నుంచి నష్టపరిహారం అందేలా చూస్తామని హామీ ఇచ్చారు.