వర్తక సంఘం లోని వెంకటేశ్వర స్వామి దేవాలయంలో

Published: Tuesday February 07, 2023

ముగిసిన 16 బ్రహ్మోత్సవాలు మధిర ఫిబ్రవరి 6 ప్రజాపాలన ప్రతినిధి మున్సిపాలిటీ పరిధిలో సోమవారం నాడు వర్తక సంఘ లోనే శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో 16వ బ్రహ్మోత్సవాలు ముగింపు భాగంగా ముఖ్య అతిథి జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు హాజరబ్రహ్మోత్సవాల్లో భాగంగా అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించిన లింగాల కమల్ రాజు మున్సిపాలిటీలో వర్తక సంఘం లో ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాల్లో సోమవారం నాడు జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు పాల్గొన్నారు ఆలయానికి చేరుకున్న ఆయన కు అర్చకులు, ఆలయ నిర్వాహకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు అనంతరం దేవస్థానంలో వెంకటేశ్వర స్వామి వారి వద్ద లింగాల కమల్ రాజు ప్రత్యేక పూజలు నిర్వహించారు అలానే బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు  ఈ సందర్భంగా జడ్పీ చైర్మన్ మాట్లాడుతూ ఆలయ కమిటీ నిర్వాహకులు శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో 16వ వార్షికోత్సవ భాగంగా అన్నదాన కార్యక్రమం చేయటం ఉత్సవాలు నిర్వహించటం కమిటీ వారికి అభినందనలు తెలుపుతూ ఈ మహా అన్నదానం దాతల సహకారంతో నిర్వహించటం అన్నం పరబ్రహ్మ స్వరూపిణి అన్నదానం చేయటం వెంకటేశ్వర స్వామి దీవెనలు అందరికీ ఉండాలని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు వేముల తిరుపతిరావు జగన్ మోహన్ రావు నరసింహారావు రమేష్  శ్రీనివాస్, తూములూరి ఉపేందర్ సత్యనారాయణ సొసైటీ అధ్యక్షులు కృష్ణ ప్రసాద్ సుధాకర్ ప్రసాద్ భాస్కర్ రెడ్డి వార్డు కౌన్సిలర్లు మున్సిపల్ చైర్మన్ మొండితోక లతా జయకర్ జీవి రెడ్డి అరిగి శ్రీను మున్సిపల్ వైస్ చైర్మన్ విద్యాలత వెంకట్ రెడ్డి అప్పారావు కనుమూరు వెంకటేశ్వరరావు బిఆర్ఎస్ నాయకులు దేవాలయ అర్చకులు సిబ్బంది పాల్గొన్నారు