స్వతంత్ర భారత వజ్రోత్సవంలో భాగంగా కోరుట్ల పురపాలక సంఘం ఆధ్వర్యంలో వన మహోత్సవం

Published: Monday August 22, 2022
కోరుట్ల, ఆగస్టు 21 ( ప్రజాపాలన ప్రతినిధి ):
స్వతంత్ర భారత వజ్రోత్సవాలు కార్యక్రమంలో భాగంగా ఆదివారం రోజున కోరుట్ల పురపాలక సంఘం ఆధ్వర్యంలో వన మహోత్సవంలో భాగంగా మొక్కలు నాటారు. కావేరి గార్డెన్, సంగెం రోడ్ వద్ద ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు మరియు మున్సిపల్ చైర్ పర్సన్ అన్నం లావణ్య మొక్కలను నాటి కార్యక్రమాన్ని ప్రారంబించారు. అనంతరం మున్సిపల్ సిబ్బంది సంగెం రోడ్ కి ఇరువైపులా మొక్కలను నాటారు.ఈ కార్యక్రమంలో ఎమెల్యే విద్యాసాగర్ రావు, మున్సిపల్ చైర్ పర్సన్ అన్నం లావణ్య, వైస్ చైర్మన్ గడ్డమీది పవన్, మున్సిపల్ కమిషనర్ మహమ్మద్ ఆయాజ్, ఏసిపి వి.బి శ్రీనివాస్, డై.ఈ.ఈ అభినయ్, ఏ.ఈ  లక్ష్మి, మేనేజర్ సీ.ఎచ్. శ్రీనివాస్, వార్డ్ కౌన్సిలర్స్, మున్సిపల్ అధికారులు, మెప్మా సిబ్బంది, అర్.పి లు, పాల్గొన్నారు.