అంబేద్కర్ సెంటర్లో రూ 6 లక్షలతో డ్రైనేజీ పనులు ప్రారంభం.

Published: Monday June 14, 2021
మధిర, జూన్ 13, ప్రజాపాలన ప్రతినిధి : మధిర మున్సిపాలిటీరడ్రైనేజీ పనులను పరిశీలించిన మున్సిపల్ చైర్ పర్సన్ మొండితోక లతా జయకర్, కమిషనర్ రమాదేవి. మున్సిపాలిటీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే లక్ష్యమని జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు సహకారంతో మున్సిపాలిటీలోని వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని మున్సిపల్ చైర్ పర్సన్ మొండితోక లత పేర్కొన్నారు. ఆదివారం అంబేద్కర్ సెంటర్లో 6 లక్షల రూపాయలతో నిర్మిస్తున్న డ్రైనేజీ పనులను కమిషనర్ రమాదేవి తో కలిసి పరిశీలించారు. డ్రైనేజ్ పనులకు ఆ ప్రాంత ప్రజలు సహకరించాలని ఈ సందర్భంగా వారు కోరారు.