వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో రైతు సదస్సు

Published: Wednesday March 23, 2022
భద్రాద్రి కొత్తగూడెం బ్యూరో (ప్రజాపాలన) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భూర్గంపహాడ్ మండల వ్యవసాయ మార్కెట్ కమిటీ వారి ఆధ్వర్యంలో తుమ్మల చెరువు పంచాయతీ రైతు వేదికలో నిర్వహించిన కార్యక్రమంలో తుమ్మల చెరువు ఎమ్ పి టి సి తాటి పూజిత పాల్గొని వారు మాట్లాడుతూ ప్రతి ఒక్క రైతు వారు పండించిన పంటలను భూర్గంపహాడ్ మార్కెట్ కి తీసుకొచ్చి అమ్మాలని మరియు రైతులు పండించే పంటలు ఎప్పుడు ఒకే పంట వేయకుండా పంటమార్పిడి చెయ్యాలని మాట్లాడడం జరిగింది ఈ కార్యక్రమంలో భూర్గంపహాడ్ మార్కెట్ చైర్మన్ పోడియ ముత్యాలమ్మ, సర్పంచ్ బండ్ల సంధ్యరాణి, భూర్గంపహాడ్ మార్కెట్ సెక్రెటరీ నిర్మల, సొసైటీ డైరెక్టర్ కోరేం నరసింహరావు తదితరులు పాల్గొన్నారు.