శ్రీ సాయి వైకుంఠ ట్రస్ట్ క్యాలెండర్ ఆవిష్కరణ

Published: Friday March 04, 2022
రాయికల్, మార్చి 3 (ప్రజాపాలన ప్రతినిధి) : రాయికల్ పట్టణ కేంద్రంలో శ్రీ సాయి ట్రస్ట్ 2022 నూతన సంవత్సర  క్యాలెండర్ ను ట్రస్టు జాతీయ అధ్యక్షులు డాక్టర్ రవి కిరణ్ యాదవ్ సూచన మేరకు రాయికల్ మున్సిపల్ కార్యాలయ ఆవరణలో మున్సిపల్ చైర్మన్ హనుమాన్లు, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గన్నరాజరెడ్డి, మున్సిపల్ కమిషనర్ గంగుల సంతోష్ కుమార్ చేతులమీదుగా క్యాలెండర్ ఆవిష్కరించారు. అనంతరం ప్రస్తుత సేవలను పలువురు కొనియాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు గంగుల శ్రీనివాస్, టి.వై.ఎం.ఎం.ఎస్.యు. రాష్ట్ర అధ్యక్షులు వేల్పుల స్వామి యాదవ్, మండల శాఖ అధ్యక్షులు రెబాస్ మల్లయ్య యాదవ్, రాజేష్ యాదవ్, ఆసరి మల్లేష్ యాదవ్, దాన వేణి చిన్న మల్లయ్య యాదవ్, జక్కుల స్వామి యాదవ్, వంశీ యాదవ్, తిరుపతి యాదవ్, రవి యాదవ్, వెంకటేష్ యాదవ్, యాదవ్ మహేష్, యాదవ సభ్యులంతా పాల్గొన్నారు.