ప్రభుత్వ విప్ బాల్క సుమన్ ను పరామర్శించిన ప్రో. దేవదాస్ నాయక్

Published: Monday June 07, 2021
జగిత్యాల, జూన్ 06, (ప్రజాపాలన ప్రతినిధి) : చెన్నూరు ఎమ్మెల్యే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ బాల్క సుమన్ తండ్రి, తెలంగాణ ఉద్యమకారులు, మెట్ పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ బాల్క సురేష్ ఇటీవల అనారోగ్యంతో మరణించడంతో వారి స్వగృహం రేగుంటలో బాల్క సురేష్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించిన అఖిల భారతీయ గిరిజన సమాఖ్య రాష్ట్ర కార్యనిర్వహక అధ్యక్షులు ప్రో. నునావత్ దేవదాస్ నాయక్. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బాల్క సుమన్ ను పరామర్శించారు.