కలెక్టర్ కార్యాలయం ఎదుట కాంగ్రెస్ పార్టీ ధర్నా*

Published: Friday January 20, 2023
మంచిర్యాల టౌన్, జనవరి 19, ప్రజాపాలన : పోలీస్ ఉద్యోగుల నియామకం లో జరిగిన అవకతవకలను నిరసిస్తూ యువజన కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో  గురువారం కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం పలు డిమాండ్స్ తో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు తాళ్ల సంపత్ రెడ్డి మాట్లాడుతూ దేశంలో ఏ రాష్ట్రంలో లేని నిబంధనలను అమలులోకి తీసుకువచ్చి తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు రాకుండా కుట్ర పన్నిందని ఆరోపించారు. ప్రభుత్వం తన తప్పిదాన్ని గుర్తించి ఉద్యోగాల నియామక పోటీల్లో పాల్గొన్న అభ్యర్థులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు.   రన్నింగ్ ఈవెంట్లలో క్వాలిఫై అయిన అభ్యర్థులందరికీ ఉద్యోగాన్ని కల్పించాలని కోరారు. లేని పక్షంలో యువజన కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం తీవ్రం చేస్తామని హెచ్చరించారు. 
ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు తిరుమల రావు, మంచిర్యాల నియోజకవర్గ అధ్యక్షులు సల్ల మహేష్ , బెల్లంపల్లి నియోజకవర్గ అధ్యక్షులు ముడుమడుగుల మహేందర్, చెన్నూరు నియోజకవర్గ అధ్యక్షులు కిష్ణ, సారేష్, జనరల్ సెక్రటరీ రత్నం ప్రదీప్, మంచిర్యాల అసెంబ్లీ జనరల్ సెక్రటరీ రంగు అజయ్ గౌడ్, మంచిర్యాల పట్టణ అధ్యక్షులు షేర్ పవన్, ఠాకూర్ చింటు సింగ్,తదితరులు పాల్గొన్నారు.