ప్రారంభమైన మత్స్యగిరి బ్రహ్మోత్సవాలు
Published: Tuesday November 16, 2021
యాదాద్రి నవంబర్ 15 వలిగొండ ప్రజాపాలన ప్రతినిధి మండల పరిధిలోని వెంకటాపురం గ్రామంలో గల శ్రీ మత్స్యగిరి లక్ష్మి నరబిసింహ స్వామి వారి బ్రహ్మోత్సవంలో భాగంగా సోమవారం యాగశాల ద్వారతోరణార్చన, గరుడ ధ్వజ,ప్రతిష్ట పల్లకి, ధ్వజారోహణం, భేరీతాడనం, దేవాతాహ్వానము, చతుస్థానార్చన హోమం, తీర్థప్రసాద గోష్టి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ ముద్దసాని కిరణ్ రెడ్డి, ఈఓ కే రవికుమార్, ధర్మ కర్తలు, సిబ్బంది, పూజారులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: