వధూవరులను ఆశీర్వదించిన సైదులునాయక్..

Published: Tuesday April 19, 2022
తల్లాడ, ఏప్రిల్ 18 (ప్రజాపాలన న్యూస్): వైరా నియోజకవర్గ పరిధిలోని ఏన్కూరు మండలంలో రాజులపాలెం గ్రామానికి చెందిన భూక్యా నారాయణ కూతురు భవిత, నరేష్ ల వివాహం సోమవారం గ్రామంలో జరిగింది. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ వైరా నియోజకవర్గ నాయకులు బాధావత్ సైదులు నాయక్ హాజరై నూతన వధూవరులకు అక్షింతలు వేసి దీవించారు. నిండు నూరేళ్లు అష్టఐశ్వర్యాలతో, పిల్లాపాపలతో కలకాలం వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట నాయకులు భూక్య హరిలాల్ నాయక్, వాంకుడోత్ హతీరాం, బానోతు హతిరామ్, బానోతు రామకోటి, గుగులోతు మంగ్యా, మాజీ సర్పంచ్ మాలోతు నరసింహారావు, తదితరులు ఉన్నారు.