ప్రజాసంగ్రామ యాత్ర విజయవంతం చేయాలి
Published: Thursday December 01, 2022
జన్నారం, నవంబర్ 30, ప్రజాపాలన: భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడు బండి సంజయ్ కుమార్ నిర్మల్ జిల్లాలో చేపట్టి 5వ విడత ప్రజా సంగ్రామ పాదయాత్రను విజయవంతం చేయాలని బుధవారం బిజెపి ఖానాపూర్ అసెంబ్లీ నాయకులు అజ్మీర హరి నాయక్, జన్నారం మండల అధ్యక్షులు గోలిచంద్ అన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మండల కేంద్రంలో గోడపత్రాలను ఆవిష్కరించి ప్రచార రథం ప్రారంభించారు. ఖానాపూర్ నియోజవర్గంలో డిసెంబర్ 7 తేదీన పాదయాత్ర జరుగుతుందని తెలిపారు. ఆ పాదయాత్రను విజయవంతం చేసేలా ప్రచార రథంతో గ్రామ గ్రామాల్లో ప్రచారం నిర్వహిస్తామని వారు తెలిపారు. ఈ పాదయాత్రకు నాయకులు, కార్యకర్తలు, యూత్ ప్రజలందరూ భారీ సంఖ్యలో రావాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్టి మోర్చా అధ్యక్షులు బోడ తిరుపతి, బీజేవైఎం అధ్యక్షులు మడుగు ప్రవీణ్, బాదంపల్లి బూత్ అధ్యక్షులు చందు, సాయి నిఖిల్, రేండ్లగూడ జనరల్ సెక్రెటరీ నరేష్, మాజీ ఎంపీపీ జక్కుల సురేష్, మాజీ మండల అధ్యక్షులు వీరాచారి, బీజేవైఎం జనరల్ సెక్రెటరీ దేవరకొండ శివ, బీజేవైఎం నాయకులు శర్మ, రాజు గౌడ్, బీజేపి నాయకులు గంగమల్లు, చిట్టిబాబు, తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: